‘దసరా’ నిర్మాతల వల్ల నేను రూ.70 వేలు లాస్ అయ్యాను: సింగర్ శ్రీను

by Prasanna |
‘దసరా’ నిర్మాతల వల్ల నేను రూ.70 వేలు లాస్ అయ్యాను: సింగర్ శ్రీను
X

దిశ, సినిమా: మనకు తెలిసి సాధారణంగా సినీ పరిశ్రమలో రకరకాల మోసాలు జరుగుతుంటాయి. చాలామంది సినిమాకు పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతుంటారు. అయితే శ్రీకాకుళానికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్, సింగర్ శ్రీను కూడా ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు చెప్తున్నాడు. ‘సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారు. షూటింగ్‌కు వచ్చేంత వరకు మర్యాదగా మాట్లాడతారు. మూవీ ఫినిష్ అవ్వగానే పట్టించుకోరు. డబ్బులు కూడా ఇవ్వరు. నేను నాని ‘దసరా’ మూవీ కోసం 23 మందిని తీసుకొని గోదావరిఖని వెళ్లాను. వారం రోజుల వరకు అక్కడే ఉన్నాం. మూవీ టీం నాకు డబ్బులు ఇవ్వలేదు. తీసుకెళ్లినందుకు 23 మంది డబ్బులడిగారు. నా జేబులో నుంచి 70 వేలు ఇచ్చాను. దసరా వల్ల లాస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: అందరిముందే అక్కడ చేతులేసి నొక్కాడు.. సోనమ్ కపూర్

Advertisement

Next Story

Most Viewed